
అయితే చిరంజీవికి 30 స్ధానాల మించి రావని పోలీసు వేగుల ద్వారా తెలుసుకున్న రాజశేఖరరెడ్డి "లైట్ గా తీసుకోండి" అని చెప్పినట్టు సమాచారం. ఇప్పుడు ఫైట్ కాంగ్రెస్ కు తెలుగుదేశం పార్టీలకు మధ్యనే. మిత్రపక్షాలను కలుపుకున్న తెలుగుదేశం ఇప్పుడు కొంత బలపడినట్టు కనిపిస్తోంది.
అయితే రాజశేఖర రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఆయన ఆయనదైన పద్ధతిని ముందుకు వెళ్తున్నారు. మిత్రపక్షాల అవసరం లేకుండానే అధికారంలోకి రాగలమన్న విశ్వాసం వైఎస్ కు ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత పెద్దగా లేకపోవడం, తెలుగుదేశం, లెఫ్ట్ పార్టీల మీద ఒక కులం ముద్ర ఉండడం అధికార కాంగ్రెస్ పార్టీకి బాగా అనుకూలించే విషయం.