శుక్రవారం, అక్టోబర్ 30, 2009, 11:57 [IST]
ఆ మద్యన నయనతార సౌత్ స్కోప్ ఇచ్చిన అవార్డుల వేడుకలో పాల్గొంది. ఈ వేడుకలో నయనతారకు కంపెనీ ఇచ్చింది ప్రభుదేవా. దాదాపు మూడేళ్ళ క్రితం హైదరాబాద్ లో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్ లో నయనతారకు శింబు కంపెనీ ఇచ్చాడు. అప్పుడు నయనతార చాలా ఆనందంగా కనిపించింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు చూపుల భానాలు విసురుకుంటూ, ముగ్ధమనోహరులై ముసిముసిగా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకున్నారు. అప్పుడు వీళ్ళని చాలామంది అసూయగా చూసారట. కానీ ఈసారి ప్రభుదేవాతో కలిసి సౌత్ స్కోప్ అవార్డు ఫంక్షన్ లో పాల్గొన్న నయనతార మొహంలో సంతోషం కనపడలేదట. సో..ప్రభుదేవా కంటే శింబునే నయనతారను సంతోషపరచగలిగాడన్నమాట.