పెషావర్: పాకిస్థాన్ పార్లమెంటుకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో భాగంగా ఆదివారం పాక్లో హింస చెలరేగింది. నైరుతీ పాకిస్థాన్లోని బునిర్ పట్టణంలోని ఓ పోలింగ్ స్టేషన్ వద్ద శక్తిమంతమైన కారు బాంబు పేలడంతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 14 మంది గాయపడ్డారు. బాంబు ధాటికి పోలింగ్ జరుగుతున్న స్కూలు భవనమే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఇళ్లు కూడా భారీగా దెబ్బతిన్నాయని పోలీసులు తెలిపారు.