Oneindia Mobile
New Videos here on ur Mozilla -Get them!
జగన్ పేరుతో రోశయ్యకు ఆటంకం: పాల్వాయి
బుదవారం, నవంబర్ 4, 2009, 19:05 [IST]



Pallwai Govardhan Reddy
న్యూఢిల్లీ: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పేరు చెప్పి కొంత మంది మంత్రులు, శాసనసభ్యులు ముఖ్యమంత్రి కె. రోశయ్య పాలనకు ఆటంకం కలిగిస్తున్నారని కాంగ్రెసు సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారంనాడు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తనకు అంతా తెలుసునని, తాను రోజువారీ నివేదిక తెప్పించుకుంటున్నానని, ఎప్పుడు ఏం చేయాలో అప్పుడు అది చేస్తానని సోనియా తనతో అన్నట్లు ఆయన తెలిపారు.

రోశయ్య పాలన బాగా ఉందని, సోనియా సహకారం లభిస్తే మరింత మెరుగ్గా పాలన అందిస్తారని ఆయన చెప్పారు. కొన్ని చిన్న లోపాలు ఉన్నప్పటికీ రోశయ్య మంచి పాలన అందిస్తున్నారని ఆయన చెప్పారు. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెసు విజయం సాధించినందుకు అభినందించడానికి తాను సోనియాను కలిసినట్లు ఆయన తెలిపారు.



»Home »News  »Entertainment  »Currency  »Free Classifieds  »Cricket  »TV Schedules  »In Theatres  »Weather  »Languages  »Horoscope 

© Greynium Information Technologies Pvt. Ltd.