Oneindia Mobile
New Videos here on ur Mozilla -Get them!
కాంగ్రెస్ లో గ్రేటర్ ఎన్నికల కలకలం
శుక్రవారం, నవంబర్ 6, 2009, 11:49 [IST]



Hyderabad
హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ టిక్కెట్ల కేటాయింపు విషయమై కాంగ్రెస్‌ పార్టీలో రగడ మొదలైంది. టిక్కెట్ల కేటాయింపులో మంత్రి దానం నాగేందర్‌ నిజమైన కార్యకర్తలకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ నివాసం ఎదుట కాంగ్రెస్‌ కార్యకర్తలు ధర్నాకు దిగారు. దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దానం తన మంత్రి పదవికి కూడా రాజీనామా చేయాలని కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి డిమాండ్‌ చేశారు. టిక్కెట్ల కేటాయింపులో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి భాగస్వామ్యం ఉందని ఆయన ఆరోపించారు.

గ్రేటర్‌ ఎన్నికల టికెట్ల కేటాయింపులో నిజమైన కార్యకర్తలకు మంత్రి దానం నాగేందర్‌ అన్యాయం చేశారని ఎమ్మెల్యేలు భిక్షపతి, ఆకుల రాజేందర్‌ ఆరోపించారు. అభ్యర్థులకు టికెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణల్లో వాస్తవం ఉందన్నారు. ఈ విషయంలో ఎలాంటి పోరాటానికైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.



»Home »News  »Entertainment  »Currency  »Free Classifieds  »Cricket  »TV Schedules  »In Theatres  »Weather  »Languages  »Horoscope 

© Greynium Information Technologies Pvt. Ltd.