పెసర పిండి - 1/2 kg బియ్యం పిండి - 1/2 kg శనగ పిండి - 1 కప్పు ఉప్పు - రుచికి సరిపడ కారం - 2 tsp నెయ్యి - 100 gms ఆయిల్ - వెయించడానికి తగినంత వామ్ము - 2 tsp
1. పెసర పిండి, బియ్యంపిండి, శనగ పిండిలో తగినంత ఉప్పు వేసి అన్ని మిక్స్ అయ్యేలాగా కలపాలి. 2. కారం, వాము, కొద్దిగా కాచిన నెయ్యి చేర్చి కొద్దిగా నీరు పోసి కలుపుతూ మృదువుగా కలుపుకోవాలి. 3. ఇప్పుడు ఈ మిశ్రామాన్నంతటిని ముద్దగా చేసుకోవాలి. కాటను బట్టను తడిచేసి ఆ బట్టలో ఆముద్దను చుట్టి ఓ పావుగంట సేపు పక్కన పెట్టుకోవాలి. 4. స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో నూనె పోసి బాగా కాగనివ్వాలి. తర్వాత చక్రాలు వత్తే దానికి కొద్దిగా నెయ్యి లేదా నూనె రాసి అందులో పిండి పెట్టి చక్రాల్లా వత్తుకుని దోరగా వేయించి పెట్టుకోవాలి. అంతే జంతికలు రెడీ.